ఈ మధ్య కాలంలో వివాదాస్పద చిత్రాలు కామన్‌ అయిపోయాయి. కానీ గతంలో ఆ తరహా సినిమాలు పెద్దగా కనిపించేవి కావు. ముఖ్యంగా భారీ ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉన్నా స్టార్ హీరోలు వివాదాస్పద చిత్రాల్లో నటించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. కావాలని చేయకపోయినా చిరంజీవి నటించిన ఓ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ అప్పట్లో ఎంతో వివాదాస్పదమైంది.

 

చిరంజీవి హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం అల్లుడా మజాకా. రమ్యకృష్ణ, రంభ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ మెగాస్టార్‌ కు అత్త పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో స్కిన్‌ షోతో పాటు, డబుల్‌ మీనింగ్ డైలాగ్‌ల డోస్ కాస్త ఎక్కువైందంటూ అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షో నుంచే వ్యతిరేకత మొదలైంది.

 

ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ల సన్నివేశాల్లో మహిళలను అవమానకరంగా చూపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అప్పట్లో మహిళా సంఘాటు సినిమాలో సన్నివేశాలను డైలాగ్స్‌ను తొలగించాలంటూ భారీగా ఉద్యమాలు కూడా జరిగాయి. దీంతో తలొగ్గిన చిత్రయూనిట్ సినిమా రిలీజ్ తరువాత సన్నివేశాలను ఎడిట్‌ చేసి రీ రిలీజ్ చేసింది. అయితే అప్పటికే నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ కావటంతో సినిమా ఫెయిల్ అయ్యింది.

 

సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. దర్శకుడు ఈవీవీ కెరీర్‌లోనూ దారుణమైన ఫెయిల్యూర్స్‌లో ఒకటిగా నిలిచింది అల్లుడా మజాకా. ఈ సినిమా తరువాత కథల ఎంపికలో మెగాస్టార్ చిరంజీవి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ తరువాత తన సినిమాలో స్త్రీలకు సంబంధించిన సన్నివేశాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: