ఈ సంవత్సరం ప్రారంభం రష్మిక కు చాల జోష్ తో మొదలైంది. సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ వెనువెంటనే ఫిబ్రవరిలో ఈమె నటించిన ‘భీష్మ’ ఈ రెండు సినిమాలు వరస విజయాలు సాధించడంతో ఈ సంవత్సరం హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా రష్మిక మారిపోతుంది అన్న అంచనాలు వచ్చాయి. ఇలా వరస విజయాలు ఇచ్చిన జోష్ తో ఈమె తన రెమ్యూనరేషన్ పెంచాలని అనుకుంది.


తనకు ఏర్పడిన్ క్రేజ్ తో చాల సులువుగా తనకు రెండు కోట్ల పారితోషికం వస్తుంది అన్న అంచనాలు ఆమె ఏర్పరుచుకుని ఫిబ్రవరి ప్రాంతంలో ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అనేకమంది దర్శక నిర్మాతలను ఒక నెల రోజులు తరువాత కలవండి అంటూ రష్మిక అప్పట్లో సమాధానం ఇచ్చింది అని అంటారు. అయితే మార్చి నెల నుండి ఊహించని ఉపద్రవంగా కరోనా ముంచుకు రావడంతో ఇప్పుడు రష్మిక చేతిలో అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో నటించే మూవీ తప్ప మరే భారీ సినిమా ఆమె చేతిలో లేదు.


దీనికితోడు ఆమె డేట్స్ కోసం ఆమె చుట్టూ తిరిగిన దర్శక నిర్మాతలు కూడ ప్రస్తుతం ఆమెను కథల విషయమై కాని డేట్స్ విషయమై కాని కాంటాక్ట్ చేయడం లేదని తెలుస్తోంది. అదేవిధంగా కరోనా పరిస్థితులు వలన ఫిలిం బడ్జెట్ లపై అందరు కోతలు విధిస్తున్న పరిస్థితులలో బన్నీ లేటెస్ట్ మూవీ విషయంలో కూడ రష్మిక పారితోషిక విషయంలో కోత పడుతుంది అని అంటున్నారు.


ప్రస్తుతం తమిళ హీరో కార్తి పక్కన ఒక తమిళ సినిమా చేస్తోంది. ఈ మూవీ లాక్ డౌన్ తరువాత తిరిగి ధియేటర్లు ఓపెన్ అయిన తరువాత తమిళనాడులో విడుదల అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ గా బన్నీ పక్కన చేస్తున్న సినిమాలో రష్మిక పాత్ర తెలంగాణ యాశతో ఉండే నేపధ్యంలో తెలంగాణ భాష పై పట్టు ఆమెకు ఏర్పడటానికి సుకుమార్ రోజుకు రెండు గంటలు చప్పున ఆమెకు తెలంగాణ భాష పై ప్రాక్టీసు ఇప్పిస్తున్నట్లు టాక్. పారితోషికం పెరగక పోయినా సుకుమార్ సినిమా అంటేనే టార్చర్ కాబట్టి ఆ స్వీట్ టార్చర్ ను భరిస్తూ కరోనా తనను మోసం చేసింది అని బాధ పడుతోంది అని తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: