మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాల కమర్సియల్ ఎంటర్టైనర్ రచ్చ. స్టార్ హీరోలను డీల్ చేసిన అనుభవం లేని సంపత్ నంది దర్శకత్వంలో చరణ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ పాట భారీ వివాదానికి కారణమైంది. సినిమాలోని ఓ పాట కారణంగా రామ్ చరణ్ కూడా కాంట్రవర్సీని ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమాలో వాన వాన వెళ్లువాయే పాటను రిమిక్స్ చేశారు. ఈ పాటలో ఓ రేంజ్లో గ్లామర్ను ఒలకబోసింది హీరోయిన్ తమన్నా. చరణ్, తమన్నాల మధ్య ఇంటిమేట్ సీన్స్తో రూపొందించిన ఈ పాట కోసం వేసిన సెట్ వివాదానికి కారణమైంది. సెట్లో భాగంగా బుద్దుడి ముఖం వరకు ఉన్న ఆకారాన్ని డిజైన్ చేశారు. ఈ బొమ్మ వల్లే వివాదం మొదలైంది.
బుద్ధుడి ముందు ఇలాంటి రొమాంటిక్ సాంగ్కు డ్యాన్స్ చేయటం ఏంటి అంటూ కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం తో పాటు సెన్సార్ బోర్డుకు కూడా వారు వినతి పత్రం పంపటంతో తప్పని సరి పరిస్థితిలో చిత్రయూనిట్ పాటలో బుద్దుడు కనిపించే వరకు బ్లర్ చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే సినిమా సూపర్ హిట్ కావటంతో ప్రజలు వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను మర్చిపోయారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తరువాత రామ్ చరణ్ కూడా సినిమా ల ఎంపిక ల కాస్త రూట్ మార్చాడు. ఎక్కువగా వివాదాల జోలికి పోకుండా జాగ్రత్తగా కొత్త కథలను ఎంచుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు మాస్ మసాలా ఎంటర్టైనర్లను మాత్రమే చేస్తూ వచ్చిన చరణ్, డిఫరెంట్ సినిమాలను చేసేందుకు ఇంట్రస్ట్ చూపించాడు.