మనకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవొద్దు.. అందునా కష్టకాలంలో సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుకు పెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు దేశం మొత్తం కరోనా మహమ్మారితో విల విలలాడిపోతుంది.. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే వలస కార్మికుల కష్టాలు చూసి చలించిపోయిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఒక అడుగు ముందుకు వేసి వారిని తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అంతే కాదు వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆహారాన్ని అందిస్తూ రక్షణగా నిలిచాడు. ఒక దశంలో కొంత మంది ఆమ్మాయిలను తమ స్వస్థలాలకు చేరుకునేలా ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశారు.
అందుకే భారత దేశం మొత్తం సోనూసూద్ ని రియల్ హీరోగా మెచ్చుకుంటున్నారు. అయితే తెలియని విషయం ఏమిటంటే.. ఇతనిని అందరూ దేవుడిలా భావిస్తుంటే.. ఇంకో అడుగు ముందుకేసి ఓ అభిమాని దేవుడికి చేయాల్సిన పూజలు సోనుసూద్ ఫొటోకు చేస్తున్నాడు. ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. మనీష్ అనే కుర్రాడు సోనూ సూద్ ని సాయిబాబా ఫోటో పక్కన పెట్టి మరీ పూజించాడు. లాక్డౌన్లో వేరే ప్రాంతంలో ఇరుక్కుపోయిన అతన్ని తల్లి వద్దకు చేర్చిన సోనూసూద్ను దేవుడిలా భావిస్తున్నాడు.
‘అందుకే దేవుడికి చేయాల్సిన పూజలు మా దేవుడు సోనుసూద్కు చేస్తున్నా’ అంటూ ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు మనీష్. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వీడియో చూసిన సోను సూద్ వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘తమ్ముడూ నువ్వు అలా చెయొద్దు. రోజు అమ్మను నా కోసం ప్రార్థించమని చెప్పండి. అంతా బాగుంటుంది’ అని రీట్వీట్ చేశాడు. ఈ వీడియోకు కొంతమంది పాజిటివ్గా కామెంట్లు పెడుతుంటే మరికొందరేమో.. ఇతను జూనియర్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడేమో అని కొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.
अरे भाई ऐसा मत कर 🙏 माँ से कहना मेरे लिए भी रोज़ दुआ माँग ले। सब सही हो जाएगा। https://t.co/raG8yQND3K
— sonu sood (@SonuSood) June 2, 2020