బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కడి నుంచి అతను జాతీయ స్టార్ గా మారిపోయాడు. ఇక అతని సినిమాలు అతనికి వచ్చిన క్రేజ్ అనేది పక్కన పెడితే ఇప్పుడు అతను సినిమాల విషయంలో మాత్రం ఏ విధంగా కూడా సీరియస్ గా కనపడటం లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అతని తో సినిమాలు చెయ్యాలి అనుకునే దర్శక నిర్మాతలతో కూడా అతను గతంలో మాదిరిగా లేరు అని ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఎంతో తెలియదు గానీ... 

 

అతను మాత్రం ఇప్పుడు సినిమాల విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు అనేది టాలీవుడ్ వర్గాల మాట. ఇటీవల అగ్ర దర్శకులు ముగ్గురు అడిగినా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా అతను మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు. అసలు అతనికి సినిమాల మీద ఆసక్తి లేదు అని కొంత కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి సినిమాల విషయంలో అతను ఎందుకు ఆసక్తి చూపించడం లేదు అనేది స్పష్టత లేదు గాని అతను మాత్రం ఇప్పుడు చేస్తున్న సినిమాలను ఏ వేగం లేకుండా చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకుని, 

 

రెండేళ్లకు ఒక సినిమాను విడుదల  చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నిజం ఎంత అనేది తెలియదు గాని అతనికి ఆఫర్లు వచ్చినా సరే వద్దు అనడానికి ఇదే ప్రధాన కారణం అనేది టాలీవుడ్ జనాల మాట. ప్రస్తుతం అతను రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: