టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న రేంజ్ ..క్రేజ్ ఏంటో సౌత్ మొత్తం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తన సొంత నిర్మాణ సంస్థ అయిన జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఇతర బ్యానర్ ని కలిపి సినిమాలలో భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు. ఆయన తాజా చిత్రం సర్కారు వారి పాట ని కూడా మరో రెండు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. కాని మొదటిసారి తన నిర్మాణం లో మరో హీరో సినిమాని తీస్తున్నాడు సూపర్ స్టార్.  సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో కొంత మంది హీరోలు ఇమేజ్ కోసం సినిమాలు చేస్తారు. కొంతమంది క్రేజ్ తో వందల కోట్లు సంపాదించడానికి సినిమాలు చేస్తారు. 

 

మరికొంతమంది ఫ్యాషన్ కోసం సినిమాలు చేస్తారు. అలాంటి వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా అంటే ప్రాణం పెట్టే వీళ్ళు ఈరోజు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారంటే అది ఫ్యాషన్ సినిమా అంటే విపరీతమైన పిచ్చి, ప్రేమ.. అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు లిస్ట్ లోకి యంగ్ హీరో అడవి శేష్ వచ్చి చేరాడు. ఈ హీరో టాలీవుడ్ కి వచ్చి చాలా ఏళ్ళైనప్పటికి గత రెండు మూడేళ్ళుగా వచ్చిన సినిమాలతోనే మంచి ఫేం ని సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్ కాకపోయినప్పటికి మంచి మార్కెట్ ని బాగా సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇప్పుడున్న కొందరు యంగ్ హీరోలతో పొల్చుకుంటే అడవి శేష్ చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. 

 

క్షణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్... తర్వాత గూఢా చారి, ఎవరు సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక పి.వి.పి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ సపోర్ట్ ఉండటం కూడా గొప్ప విషయం. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ, స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ అలాగే, క్రియోటివ్ థాట్స్ తో మంచి స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకోవడం లో అడవి శేష్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు అడవి శేష్ తో సినిమాని నిర్మిస్తున్నారు. 2008 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ లో శేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు.. హిందీ భాషల్లో సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తుండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: