రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంటరయ్యాడు సుజీత్. ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తోను జర్నీ స్టార్ట్ చేశాడు. సాహో కథ చెప్పి ప్రభాస్ ని విపరీతంగా ఇంప్రెస్ చేసిన సుజీత్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికి సుజీత్ కి మేకింగ్ పరంగా సౌత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు నార్త్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని విపరీతంగా ఆకట్టుకున్నాడు.

 

రెండవ సినిమాతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని డైరెక్ట్ చేయడం సాహో సినిమాతో పాన్ ఇండియా సినిమాని డైరెక్ట్ చేసి పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయాడు సుజీత్. అయితే సుజీత్ కి ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి మాత్రం కంప్లీట్ గా ప్రభాస్ కారణమే అని చెప్పాలి. డార్లింగ్ సపోర్ట్ లేకపోతే సుజీత్ ఈ రోజు ఈ స్థాయికి చేరుకునేవాడు కాదు. 

 

ఇక సాహో సినిమా రిజల్ట్ తో మళ్ళీ ఇప్పట్లో సుజీత్ కి సినిమా అవకాశం రావడం కష్టం అనుకున్నారు. కాని మళ్ళీ ప్రభాస్ చొరవ తీసుకొని ఏకంగా చిరంజీవి ని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించాడు. మళయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ తో సుజీత్ మెగాస్టర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

 

ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి తో తెరకెక్కిస్తున్న ఆచార్య తర్వాత సుజీత్ చిరంజీవి సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈలోపే సుజీత్ కి సంబంధించిన ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదే తన పెళ్ళి గురించి. తన ప్రేమించిన అమ్మాయితో త్వరలో సుజీత్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడని సమాచారం. అయితే ఈ విషయంలో ప్రభాస్ కూడా సపోర్ట్ చేశాడని ప్రభాస్ సలహా మేరకే సుజీత్ పెళ్ళి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. నిజంగా జీవితంలో ప్రతీ విషయంలో వెనక ఉండి సపోర్ట్ చేయడానికి డార్లింగ్ ప్రభాస్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళంత లక్కీ పర్సన్ ఇంకొకరు ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి: