మన తెలుగులో మంచి మల్టీ స్టారర్ సినిమా కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు వస్తుంది అనేది  చాలా మందికి పైకి చెప్పలేని విధంగా ఆసక్తి అనేది ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరూ కూడా బిజీ గానే ఉన్నారు. ఎవరు కూడా ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశం లేదు. అయినా సరే ఇప్పుడు కొందరు నిర్మాతలు టాలీవుడ్ లో మల్టీ సరార్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నారు అని సమాచారం. 

 

పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాని ఎప్పటికి అయినా తీసుకుని రావాలి అని  సినీ పెద్దలు కొందరు భావిస్తున్నారు. దీనికి వాళ్ళు ఓకే చెప్పినా లేకపోయినా సరే వాళ్ళ నుంచి ఏ విధంగా అయినా సరే సినిమాను తీసుకుని రావడానికి గానూ కొందరు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇటీవల అల్లు అరవింద్సినిమా గురించి అడిగినట్టు సమాచారం. ఇప్పట్లో టాలీవుడ్ లో ఎవరూ కూడా మల్టీ స్టారర్ చేసే అవకాశం లేదని మనం చేద్దామని పవన్ తో ఇప్పటికే ఆయన చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

దీని వెనుక నిజం ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఈ సినిమా కోసం మాత్రం ఆయన చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఈ సినిమా చెయ్యడానికి పవన్ ముందుకు వచ్చినా సరే చిరంజీవి మాత్రం ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు అనేది అర్ధమవుతుంది. మరి ఈ సినిమా విషయంలో ఏ విధంగా అల్లు అరవింద్ ముందుకి వెళ్ళే అవకాశం ఉంది అనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: