ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో ఏ స్థాయిలో సినీ పరిశ్రమ నష్టపోయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ రోజు కూడా కరోనా తీవ్రత పెరగడం తో ఇప్పుడు సినిమాల షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు సినిమాల షూటింగ్ కి అనుమతులు వద్దు అనే భావన లో ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో సినీ కార్మికులు మరోసారి రోడ్డున పడ్డారు. వందల మంది ఇప్పుడు షూటింగ్ ల కోసం ఎదురు చూస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే మహేష్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పరుశురాం తో తాను చేస్తున్న సినిమాలో ఎవరు అయితే కార్మికులు పని చేస్తారో వాళ్ళ అందరికి నెల రోజుల పాట లేదా సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు కూడా అండగా ఉండాలి అని మహేష్ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అతను నిర్మాతలతో కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వారు అందరికి కూడా మహేష్ నుంచి సహాయం అందే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక వారి తో పాటుగా చిన్న చిన్న వారికి కూడా మహేష్ సహాయం చేసే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. 

 

ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతని నుంచి ఏ సినిమా వస్తుంది అనే విషయం ఇప్పుడు చెప్పడం దాదాపు కష్టమే అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు అతను ఈ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు కాబట్టి వచ్చే సినిమా విషయంలో తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అని అంటున్నారు. మరి ఏ సినిమానో...

మరింత సమాచారం తెలుసుకోండి: