బాలీవుడ్ నయా కండల వీరుడు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బాగీ 3. ఈ సిరీస్‌లో వరుసగా మూడు సినిమాలు చేసిన టైగర్ మూడు సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రిలీజ్ అయిన బాగీ 3 సినిమా తెలుగు సూపర్‌ హిట్ తడాఖా సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో అలరించిన ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

 

అయితే రిలీజ్‌ అయిన కొద్ది రోజులకే డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో అందుబాటులోకి రావటంతో బాగీ 3కి ఓ రేంజ్‌ లో ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేసింది. మొబైల్‌ ఫోన్స్‌లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా చరిత్ర సృష్టించింది బాగీ 3. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు టైగర్‌ ష్రాప్‌.

 

ఇక బాగీ సిరీస్‌ విషయానికి వస్తే. బాగీ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు టైగర్‌ ష్రాఫ్‌. ఈ సినిమా తెలుగు సూపర్‌ హిట్ వర్షంకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో సుధీర్‌ బాబు విలన్‌గా నటించటం విశేషం. ఆ తరువాత రెండో సినిమాగా వచ్చి బాగీ 2 తెలుగు హిట్ క్షణంకు రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా బాగీ 3 తడాకా రీమేక్‌గా రూపొందింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🙏❤️ #Repost @teamtigershroff - #Baaghi3 is the most-watched movie on smartphones. 🎉 📎 https://bit.ly/2MrwamH #TigerShroff #ShraddhaKapoor #SajidNadiadwala #AhmedKhan #B3

A post shared by tiger Shroff (@tigerjackieshroff) on

మరింత సమాచారం తెలుసుకోండి: