పరుత్తి వీరన్ సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన ప్రియమణి ఆ తర్వాత పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమా ప్రియమణికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నితిన్, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి సక్సస్ లను సొంతం చేసుకుంది.

 

అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకున్న ప్రియమణి కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. తమిళలో ఘన విజయం సాధించిన అసురన్ రీమేక్ నారప్ప లో వెంకటేష్ సరసన నటిస్తున్న ప్రియమణి ఈ సినిమాతో పాటే రానా దగ్గుబాటి సరసన కూడా నటిస్తుంది. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విరాటపర్వం అన్న టైటిల్ తో తెరకెక్కుతుంది. వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశర్య క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. 1992 ల నాటి పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈరోజు ప్రియామణి బర్త్ డే సందర్భంగా విరాటపర్వం నుండి తన లుక్ ని రిలిజ్ చేశారు చిత్ర బృందం. ఈ లుక్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.  

 

అలాగే నారప్ప సినిమా టీం కూడా ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా తన పాత్ర ని రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. సహజత్వంతో కూడుకున్న ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఒకేరోజు రెండు సినిమాలలోని లుక్స్ ని రిలీజ్ చేసి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. రెండు పాత్రలు వేటికవే ఎంతో వినూత్నంగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రియమణి చేస్తున్న రెండు సినిమాలు సురేష్ బాబు నిర్మిస్తుండటం విశేషం.

 

ఇక రీసెంట్ గా రిలీజైన విరాటపర్వం, నారప్ప లుక్స్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు సీనియర్ స్టార్ హీరోలకి ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అని అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లకి హీరోయిన్ సమస్య ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమణి ఈ సినియర్ హీరోలకి పర్‌ఫెక్ట్ జోడి అనడం లో ఎలాంటి సందేహం లేదు.    

మరింత సమాచారం తెలుసుకోండి: