ఫిదా సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది సాయి పల్లవి. ఈ సినిమా సక్సస్ తెలుగులో వరసగ అవకాశాలు వచ్చాయి. కాని అన్నిటిని ఒప్పుకలేదు. అందుకు కారణం సాయి పల్లవి గ్లామర్ రోల్స్ ...బికినీ లు.. లిప్ లాక్స్ నచ్చవు కాబట్టి. అందుకే ఫిదా తర్వాత నేచురల్ స్టార్ నాని తో ఎంసిఏ, పడి పడి లేచే మనసు, రణ రంగం సినిమాలు మాత్రమే చేసింది. అయితే ఈ సినిమాలు సక్సస్ ని సాధించలేదు. అయితే తమిళంలో ధనుష్ సరసన నటించిన మారి 2 మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

 

ఇక మరోసారి సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీ అన్న టైటిల్ తో తెరకెక్కుతుంది. అద్భుతమైన ప్రేమ కథ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాని రూపొందిస్తున్నాడట. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ తో పాటు టీజర్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ గ్యారెంటీ అన్న టాక్ ఉంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక సాయి పల్లవి ఈ సినిమాతో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న విరాట పర్వం సినిమాలోను నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమా కూడా సక్సస్ ని ఇస్తుందన్న నమ్మకంతో ఉందట సాయి పల్లవి. అయితే దర్శకుడు తేజ మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు.

 

అలివేలు మంగ వెంకటరమణ అన్న టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. అయితే అలివేలు పాత్రకి తేజ సాయి పల్లవిని సంప్రదించారట. కాని ఎందుకనో సాయి పల్లవి తేజ కి నో చెప్పిందట. తేజ సినిమాలలో హీరోయిన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్న విషయం తెలిసిందే. మరెందుకు సాయి పల్లవి నో చెప్పిందో తెలీదు. ఇప్పుడు ఆ పాత్రకి అనుష్క ఒకే చెప్పిందని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: