రెబల్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్  కాంబినేషన్ లో సినిమా రానుందని ఎప్పటి నుండి వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఈవిషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం మాత్రం పక్కా అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ప్రభాస్ 22 వ సినిమా గా రానున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య  నిర్మించనున్నాడట. ఈసినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా తెరక్కనుందట. ప్రభాస్ ప్రస్తుతం తన 20 వ చిత్రంలో నటిస్తున్నాడు ఆతరువాత నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నాడు ఈసినిమా పూర్తి కావడానికి  రెండు సంవత్సరాలు పడుతుంది. సో ప్రశాంత్ నీల్, ప్రభాస్ సినిమా 2023 లో ప్రారంభంకానుందన్నమాట. 
 
ఇక ప్రశాంత్ నీల్ తెలుగులో పాగా వేయడానికి రెడీ అవుతున్నాడు అందులో భాగంగా తన మొదటి సినిమాకు ఓ బడా హీరోను లాక్ చేశాడు అతనెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని  నిర్మించనుంది. ప్రశాంత్ నీల్ కు కెజిఎఫ్ తో  దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించనున్నాడు. త్వరలోనే  ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.
 
ప్రస్తుతం ఎన్టీఆర్ ,ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు ఇది పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా ను మొదలు పెట్టనున్నాడు ఇది కూడా పూర్తి చేసి ఆతరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ మాత్రం ప్రస్తుతం కెజిఎఫ్ 2 ను పూర్తి చేసేపనిలో వున్నాడు. కన్నడ స్టార్ యాష్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: