ముకుంద సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ కంచెతో ప్రేక్షకుల మెప్పు పొందినా ఫిదా సినిమాతో కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తొలిప్రేమ సినిమా కూడా వరుణ్ తేజ్ కు సూపర్ హిట్ ఇచ్చింది. ఇక గద్దలకొండ గణేష్ సినిమాతో నటుడిగా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ స్క్రీన్ నేమ్ తో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం బాక్సర్ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ ఆ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ డైరక్టర్స్ ను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. 

 

కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా పూర్తి కాగానే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వరుణ్ తేజ్ సినిమా ఒకటి ఉంటుందని తెలుస్తుంది. సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమా ప్రయిత్నించాడు. అది వర్క్ అవుట్ అయినట్టు లేదు అందుకే వరుణ్ తేజ్ తో ఆ ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వరుణ్ తేజ్ తనకు కంచె సినిమాతో మొదటి హిట్ ఇచ్చిన క్రిష్ డైరక్షన్ లో మరో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. 

 

ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఆ సినిమా తర్వాత క్రిష్ మరోసారి కంచె లాంటి కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ కు స్టోరీ లైన్ చెప్పాడట. క్రిష్ తో వర్క్ చేసేందుకు వరుణ్ తేజ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుస్తుంది. మొత్తానికి మెగా ప్రిన్స్ తన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు ఎంపిక చేసి ప్రేక్షకులను, మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: