పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఆయన అభిమానులు వెండితెరపై పవన్ కళ్యాణ్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ పాటికి వకీల్ సాబ్ చిత్రం రిలీజై ఉండేది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.

 

 

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. నివేధా థామస్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా క్రిష్ మూవీని స్టార్ట్ చేసాడు. మొఘలుల కాలం నాటి కథతో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతుంది.

 

 

అయితే ప్రస్తుతం ఈ చిత్రం మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడిప్పుడే షూటింగులకి అనుమతులు లభిస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా నిర్మాతలందరూ రెడీ అవుతున్న వేళ క్రిష్, మరికొని రోజులు వెయిట్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఇస్తున్న అనుమతులు ఎన్నో షరతులతో కూడుకున్నవి. చాలా తక్కువ మంది వర్కర్లతో మాత్రమే పనిచేసుకోవాల్సి ఉంది.

 

 


అయితే భారీ బడ్జెట్ లో తెరకెక్కే పీరియాడికల్ డ్రామాకి ఎక్కువ మొత్తంలో వర్కర్స్ అవసరం. దాంతో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకూ వెయిట్ చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసేలా ఉన్నాడని సమాచారం. హరీష్ శంకర్ సినిమాకి ఎక్కువ మంది అవసరం ఉండరు కాబట్టి పనులన్నీ చకచకా జరుపుకోవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: