‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ సినిమా మే 15 వ తారీఖున రిలీజ్ అయ్యుండేది. అయితే ప్రస్తుతం కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో త్వరలోనే కంప్లీట్ చేసి ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నట్లు సమాచారం. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లాయర్ గా పవన్ కళ్యాణ్ ని సినిమాలో నటించనున్నారు.

IHG

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ క్రిష్ సినిమా చెయ్యబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లేటుగా స్టార్ట్ అవుతున్న తరుణంలో డైరెక్టర్ క్రిష్ తాజాగా స్పీడ్ పెంచారు.

IHG

ఇప్పటికే సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తరుణంలో ఇప్పటి వరకూ చిత్రీకరించిన ఈ సినిమాని పక్కన పెట్టి మళ్లీ ఫస్ట్ నుండి క్రిష్ స్టార్ చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. సినిమా మొత్తం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ లో కంప్లీట్ అవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. సినిమా మొత్తం ఈ భారీ సెట్ లోనే కంప్లీట్ చేయాలని క్రిష్ డిసైడ్ అయ్యారట. ఇందులోనే గుర్రాల యాక్షన్ సీక్వెన్స్ తో పాటు యుద్ధ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: