సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో కచ్చితంగా మణిరత్నం పేరు ఉండి తీరుతుంది. ఆయన సినిమాలు టేకింగ్ అప్పట్లోనే నెక్స్ట్ లెవల్ అనిపించేవి.. మణిరత్నం సినిమా అంటే చాలు ఎప్పుడు చూడని ప్రేమకథ.. ఎప్పుడు వినని సంగీతం.. ఎన్నో కొత్త అనుభూతులు ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్లే వారు. కెరియర్ పీక్స్ లోకి వెళ్లి ఇప్పటి యువతరానికి పోటీగా సినిమాలు చేస్తున్న మణిరత్నం తాజాగా వెబ్ సీరీస్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడట. ఐతే మణిరత్నం కేవలం వెబ్ సీరీస్ నిర్మిస్తారని తెలుస్తుంది. 

 

ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమా తీస్తున్న మణిరత్నం లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అవడంతో ఈ గ్యాప్ లో ఒక వెబ్ సీరీస్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. తన అసిస్టెంట్ డైరెక్టర్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. మణిరత్నం వెబ్ సీరీస్ అంటే స్టార్స్ కూడా చేసేందుకు ముందుకొస్తారు. అయితే ఈ వెబ్ సీరీస్ అప్కమింగ్ ఆర్టిస్టులతో చేస్తున్నారని తెలుస్తుంది. మణిరత్నం దృష్టిలో పడితే నటీనటులకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. 

 

ఇక పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయానికొస్తే.. అసలైతే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన మహేష్, విజయ్ లాంటి హీరోలతో ఆ సినిమా ప్లాన్ చేశాడు మణిరత్నం. కానీ వాళ్లిద్దరూ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో విక్రమ్, జయం రవి, కార్తీ లతో చేస్తున్నాడు. ఈ క్రేజీ మల్టీస్టారర్ మీద కోలీవుడ్ పై చాలా హోప్స్ ఉన్నాయి. మరి మణిరత్నం ఏం చేస్తాడో చూడాలి. ఉన్నాయి. తన టెస్ట్ కు తగినట్టుగా సినిమాలు చేస్తూ అలరించే మణిరత్నం.. ఈ జెనరేషన్ కు తగినట్టుగా తన ప్రేమకథలు చెప్పాలని అనుకుంటున్నాడు. అయితే అది వెబ్ సీరీస్ ద్వారా అయితే ఇంకాస్త బాగా ప్రేక్షకుల్లో వెళ్తుందని వెబ్ సీరీస్ లకు మొగ్గు చూపుతున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: