లాక్ డౌన్ వల్ల గత రెండు నెలల నుండి సినిమాల విడుదల ఆగిపోయాయి అయితే జులై లేదా ఆగస్టు లో థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈలోగా విడుదలకు రెడీ గా వున్నా సినిమాలు పెండింగ్ వర్క్ ను పూర్తి చేసుకుంటున్నాయి అందులో భాగంగా స్థార్ హీరో సూర్య నటించిన  లేటెస్ట్ మూవీ సురరై పోట్రు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది. థియేటర్లు తెరుచుకోగానే సినిమా ను విడుదలచేయనున్నారు. అంతేకాదు కోలీవుడ్ లాక్ డౌన్ తరువాత విడుదలయ్యే మొదటి సినిమా కూడా ఇదే కానుందట. 
 
ఇక ఈసినిమా డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలకానుందని వార్తలు వచ్చాయి కానీ మేకర్స్  మాత్రం మొదట థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టం చేశారు. గురు ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్స్ ,సిఖ్య ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా  అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. తెలుగులో ఈ చిత్రం ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలకానుంది. గత కొంత కాలం నుండి వరస పరాజయాలను చవిచూస్తున్న సూర్య కు ఈసినిమా విజయం కీలకం కానుంది. 
 
ఈ చిత్రం తరువాత  సూర్య ,హరి డైరెక్షన్ లో అరువ లో నటించనున్నాడు. ఈచిత్రంలో సూర్య డ్యూయెల్ రోల్ లో నటించనుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది. ఇంతకుముందు హరి, సూర్య కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ సూపర్ హిట్ కావడంతో  అరువ పై భారీ అంచనాలు వున్నాయి.  అయితే ఈచిత్రం సింగం సిరీస్ కు సీక్వల్ కాదు. ఇక ఈ సినిమా తరువాత సూర్య, విశ్వాసం ఫేమ్ శివ తో సినిమా చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: