సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ లో నాలుగవ సినిమా, చెర్రీ రాజమౌళి కాంబినేషన్ లో రెండవ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ తెరకెక్కబోతున్నది. ప్రభాస్, రవితేజ, సునీల్, హీరో నాని, నితిన్ లాంటి హీరోల ను పెట్టి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి వారందరికీ ఎనలేని పాపులారిటీ ని తెచ్చి పెట్టాడు రాజమౌళి. కానీ అతడి సినిమాల్లో అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు నటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కోసం విజేంద్ర ప్రసాద్ ఒక కథను రెడీ చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో... మహేష్ బాబు అభిమానులు కూడా అదే స్థాయిలో కోరుకుంటున్నారు. 

 

అయితే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు 28వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్నదని సినీ వర్గాల నుండి అనేకమైన వార్తలు వెల్లువెత్తాయి. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని చెప్పాడు. దాంతో మహేష్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. కానీ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో నిజమవుతుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో చారిత్రాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిర్విరామంగా కొనసాగాలంటే దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి ముందుగా అనుకున్న దానికంటే ఆరు నెలలు ఎక్కువ సమయం పడుతుందట. దాంతో మహేష్ బాబుతో సినిమా కూడా చాలా సమయం వరకు వాయిదా పడనున్నది. 

 

మహేష్ బాబు 27వ చిత్రం పరశురాం దర్శకత్వం లో తెరకెక్కనున్నది. సర్కారీ వారి పాట అనే టైటిల్ ఖరారైన ఈ చిత్రాన్ని పూర్తి చేసిన అనంతరం మహేష్ బాబు తన 28వ చిత్రం కూడా వేరొకరి దర్శకత్వంలో చేయనున్నాడని సినీ వర్గాలు నుండి టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి చేసి, దానికి ప్రమోషన్లు చేసి ఆపై కాసేపు రెస్ట్ తీసుకుని లోపు మహేష్ బాబు ఇంకో మూవీ చేయగలడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపుద్దిద్దుకోనుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ వార్త మహేష్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: