ఇప్పుడు మెగా హీరోలు అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోల తో సినిమాలు చేయడానికి గానూ నిర్మాతలు దర్శకులు ప్రయత్నాలు కూడా ఎక్కువగానే చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు మెగా హీరోలు కాస్త  జాగ్రత్తలు పడుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఇక నుంచి కొంత కాలం పాటు కొత్త దర్శకులకు చిన్న నిర్మాతలకు అవకాశాలు ఇవ్వాలి అని వాళ్ళు భావిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని చిరంజీవి మాత్రం అదే సూచన చేసారట. 

 

చిన్న నిర్మాత బ్రతికి ఉంటే సినిమా బ్రతికి ఉంటుంది అని కాబట్టి ఆ విధంగా అడుగులు వెయ్యాలి అని చెప్పారట. దీనితో హీరోలు కూడా ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న మాట. మరి ప్రస్తుతం అగ్ర హీరోలు కూడా వాళ్ళకే అవకాశాలు ఇస్తారా లేదా అనేది చూడాలి. అగ్ర హీరోలు చాలా మంది ఇప్పుడు బిజీ గానే ఉన్నారు. పది మంది హీరోల్లో నలుగురు అగ్ర హీరోలు ఉన్నారు. దీనితో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా సినిమాలు చేస్తారు అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే చిరంజీవి ఆలోచన మాత్రం మంచిది అని అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ లో వాయిదా పడ్డాయి. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: