వీలైనప్పుడల్లా ప్రేమ యాత్రలకు వెళ్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి అభిమానుల‌కు క‌నువిందు చేస్తుంటారు ల‌వ్ బ‌ర్డ్స్  విఘ్నేష్‌ శివన్ మ‌రియు న‌య‌నతార. వీరిద్ద‌రూ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా  ప్రేమించుకుంటున్న విష‌యం తెలిసిందే. ప‌లుమార్లు వీరి పెళ్లిపై వార్త‌లు వ‌చ్చినా అదేమీ జ‌ర‌గ‌లేదు. తాజాగా మ‌రోమారు అలాంటి వార్త‌లే వస్తున్నాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో నిరాండంబ‌రంగా ఓ గుడిలో వివాహం చేసుకోవాల‌ని ఇరువురు నిశ్చ‌యించుకున్న‌ట్లు కోలీవుడ్ స‌మాచారం.  దాపు నాలుగేళ్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న రొమాంటిక్‌ జంట నయనతార- విఘ్నష్‌ శివన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. 

 


ఈ మేరకు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాలు ఈనెల 8 నుంచి తెరుచుకుంటాయని కేంద్రం ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఈ ప్రేమ‌ జంట గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం ఆరంభించాల‌ని భావిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో కొంత‌మంది న‌య‌న్‌..శివ‌న్ అభిమానులైతే ఏకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే పెళ్లి వార్త‌ల‌పై ఇరువురిలో ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొద‌లైంది.  

 


సినిమా మొద‌లు  గ‌త నాలుగేళ్లుగా  ఇద్ద‌రు ప్రేమాయణం కొన‌సాగిస్తున్నారు. వీలైనప్పుడల్లా టూర్ల‌కు వెళ్తు ఆ ఫొటోల‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో మంచి క్రేజీ ఉన్న సీనియ‌ర్ హీరోయిన్‌గా న‌య‌న‌తార‌కు గుర్తింపు ఉంది. అందానికి అందం. ఎంచుకున్న పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల న‌టిగా చెప్పాలి.  తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విష‌యం తెలిసిందే.  అలాగే ఇక ఎప్పటిలాగానే తన ఉమెన్‌సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో నటించడం ఆపలేదు ఈ లేడీ సూపర్‌స్టార్‌. శివకార్తికేయన్‌ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు విఘ్నేష్‌ శివన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: