భారత్ లో సినీ పరిశ్రమకు ఉండే మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగులో అయినా హింది లో అయినా సరే సినిమాల్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు జనాలు. దేశంలో అయితే బాలీవుడ్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒకసారి నిర్మాతగా విజయవంతం అయితే మాత్రం ఇక తిరుగు ఉండదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కువగా సినీ మార్కెట్ జరిగేది కూడా అక్కడే. ఇక ఇప్పుడు ఆ మార్కెట్ మీద క్రికెటర్లు కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి భారీ సినిమాలను విరుశ్క అనే బ్యానర్ లో నిర్మించే ఆలోచనలో ఉన్నాడు అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఒక స్టార్ హీరోతో ఇప్పటికే అతను ఒప్పందం కూడా చేసుకున్నాడు అని అంటున్నారు. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ ప్రాజెక్ట్ మాత్రం త్వరలోనే పట్టాలేక్కే అవకాశాలు అయితే ఉన్నాయి అనేది చాలా మంది చెప్పే మాట. విరాట్ కోహ్లీ ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడికి సంబంధించి మరో నిర్మాతతో కూడా చర్చలు జరిపాడు అని వార్తలు వస్తున్నాయి. 

 

ఆయన కూడా అందుకు ఓకే చెప్పాడు అని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా అనుష్క నటించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంది. లాక్ డౌన్ తర్వాత ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: