పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ భారీ స్క్రిప్ట్ రెడీ చేశాడు. హిస్టారికల్ ప్రాజెక్ట్ తో పవన్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ పవన్ మాత్రం ఈ భారీ మూవీని హోల్డ్ లో పెట్టి, మరో సినిమా చేయాలనుకుంటున్నాడట. క్రిష్ ను కొన్నాళ్లు వెయిటింగ్ లో పెట్టి మరో ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతున్నాడట పవన్. మరి పవన్ స్టార్ క్రిష్ మూవీని ఎందుకు పక్కన పెడుతున్నాడో తెలుసా.. 

 

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ సినిమా ఎనౌన్స్ అయింది. ఔరంగజేబు కాలం నాటి కథాంశంతో హిస్టారికల్ డ్రామా చేసేందుకు ప్రిపేర్ అయ్యారు పవన్-క్రిష్. లార్జ్ స్కేల్ లో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. నిర్మాత ఎ.ఎమ్.రత్నం 200కోట్లకు పైగా బడ్జెట్ ను కూడా ఫిగర్ అవుట్ చేశాడు. అయితే పవన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టి మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. 

 

ఈ నెలలోనే షూటింగ్స్ కు పర్మీషన్స్ ఇస్తారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అనుమతులు రాగానే జెట్ స్పీడ్ తో షూటింగ్స్ పూర్తి చేయాలని మేకర్స్ అంతా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణఅ కూడా ఇలాగే వకీల్ సాబ్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లిపోగానే మరో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు పవన్. 

 

కరోనా తీవ్రత తగ్గి మార్కెట్ లోకి వ్యాక్సిన్ వచ్చే వరకు మినిమం క్యాస్ట్ అండ్ క్రూతో షూటింగ్స్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ క్రిష్ మూవీ హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో బోల్డంత మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్స్ ఉన్నాయట. సో గవర్నమెంట్ ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ షూటింగ్ చేయడం కష్టమంటున్నాడట పవన్. అందుకే క్రిష్ సినిమాని హోల్డ్ లో పెట్టి, పవన్, హరీష్ శంకర్ ప్రాజక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: