తెలుగు సినిమాల్లో అందం, నటన ఉన్న హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మళయాళం నుంచి తెలుగులో పాగా వేసింది. తనదైన నటన, అందం, హావభావాలతో యూత్ ని ఎట్రాక్ట్ చేసి ఆకట్టుకుంది.. ప్రస్తుతం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న కార్తికేయ2లో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే.. అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు ఓ వార్త రౌండ్ అవుతోంది. ఆ రూమర్ అబద్దమంటూ చందు క్లారిటీ ఇచ్చాడని మరో వార్త రౌండ్ అవుతోంది.

IHG

కార్తికేయ సీక్వెల్ గా కార్తికేయ2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. ఫస్ట్ పార్ట్ లో స్వాతి హీరోయిన్ గా నటిస్తే సీక్వెల్ లో మాత్రం అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నాడు చందు. అయితే.. ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకుందని ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. కథ నచ్చక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు షికారు చేశాయి. దీంతో.. ఈ వార్తపై చందు క్లారిటీ ఇచ్చాడని మరో వార్త హల్ చల్ చేస్తోంది. కార్తికేయ2 నుంచి అనుపమ తప్పుకుందనే వార్త నిజం కాదని.. షూటింగ్ స్టార్ట్ అయ్యాక టీమ్ తో జాయిన్ అవుతుందని చందూ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అనుపమ పరమేశ్వరన్ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

IHG

కార్తికేయ సినిమాతో చందూ మొండేటి మంచి పేరు తెచ్చుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు కూడా సాధించింది. దీంతో సీక్వెల్ పై కూడా అంచనాలు ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ కు ఆమధ్య వరుస ఫ్లాపులు వచ్చినా రాక్షసుడు సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుపమ నటిస్తోందనే వార్త నిజమే అయితే అమ్మడికి మంచి అవకాశం దక్కినట్టే అని చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: