తారక్ ఫ్యాన్స్ అస్సలు తగ్గడం లేదు. మీరా చోప్రా సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు కంప్లైంట్ చేసినా.. సైకో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయండి అని జూనియర్ ఎన్టీఆర్ కు రిక్వెస్టులు పెట్టినా.. వాళ్లు మాత్రం ఆగడం లేదు. మీరాని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా ఖుష్బూ పెట్టిన ఓ ట్వీట్ తో తారక్ ఫ్యాన్స్ మరింత హడావిడి చేస్తున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, మీరా చోప్రాకు మధ్య నడుస్తోన్న ట్వీట్ వార్ ఇంకా చల్లారడం లేదు. పోలీసులు కేస్ ఫైల్ చేసినా అభిమానుల గోల మాత్రం తగ్గట్లేదు. రీసెంట్ గా ఖుష్బూ పెట్టిన ఓ ట్వీట్ తో వార్ మరింత ముదిరిపోయింది. ఖుష్బూని పొగుడుతూ.. మీరాను తిడుతూ ట్వీట్లు పెడుతున్నారు తారక్ ఫ్యాన్స్. 

 

మీరా చోప్రా రీసెంట్ గా తన ఫాలోవర్స్ తో చాట్ సెషన్ పెట్టింది.ఈ ఇంటరాక్షన్ లో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ లైన్ చెప్పమని అడిగారు. దానికి తారక్ అంటే ఎవరో తెలియదని చెప్పింది మీరా. ఇక ఈ సమాధానం చూసి జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్స్ చిర్రెత్తిపోయారు. అభ్యంతకరమైన భాషతో మీరా చోప్రాను ట్రోల్ చేశారు. దీనిపై మీరా సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు కంప్లైంట్ చేసింది. 

 

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు. మీరా చోప్రాకు మధ్య ఇష్యూ నడుస్తున్న టైమ్ లో ఖుష్బూ ఓట్వీట్ పెట్టింది. కొందరు ఆడవాళ్లు అంతే.. వాళ్లు అస్సలు మారరు.. నేర్చుకోరు అని ఓ ట్వీట్ పెట్టింది. ఇక ఖుష్బూ ట్వీట్ పెట్టడంతో తారక్ ఫ్యాన్స్ మరింత జోరుగా కామెంట్లు పెడుతున్నారు. కొత్తిమీర.. ఖుష్బూని చూసి నేర్చుకో అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఖుష్బూ చాలా సార్లు చెప్పింది. తారక్ ఎనర్జీకి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అని పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లోనూ స్టేట్ మెంట్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఖుష్బూ ఈ ట్వీట్ పెట్టడంతో మీరా గురించే అని హంగామా చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. మరి ఖుష్బూ నిజంగానే మీరా చోప్రాని టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టిందా.. మరొకరి గురించా అనేది తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: