సూపర్ స్టార్ మహేష్ బాబు 2020 ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు అంటూ అద్భుతమైన సక్సస్ ని అందుకున్నారు. భారీ కమర్షియల్ సక్సస్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీపైడిపల్లి తో సినిమా అనుకొని డ్రాపయ్యారు. అలాగే అనిల్ రావిపూడి తో ఎఫ్3 చేస్తాడని అన్నారు..కాని అది ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. అలాగే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తాడన్న వార్తలు వచ్చి కరోనా దెబ్బకి అదీ క్లారిటీ లేకుండా పోయింది. 

 

దాంతో మహేష్ బాబు సినిమా న్యూస్ కోసం ఫ్యాన్స్ తెగ ఆరాటపడ్డారు. అందరి సినిమాలు సెట్స్ మీదనో లేక రిలీజ్ కి రెడీగానో ఉన్నాయి. కాని సూపర్ స్టార్ సినిమా వచ్చి 6 నెలలు కావస్తున్న కొత్త సినిమా ఏంటన్నది క్లారిటి లేదు. దానికి తెర దించుతూ మహేష్ మైండ్ బ్లోయింగ్ టైటిల్ తో తన తాజా చిత్రాన్ని ప్రకటించారు. సర్కారు వారి పాట అని ఎప్పుడైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారో ఇక ఫ్యాన్స్ ఆగడం లేదు.

 

ఈ సినిమాకి సంబంధించి అన్ని డీటేయిల్స్ వచ్చాయి. కాని ఇంకా హీరోయిన్ విషయం లో పెద్ద డైలమా నెలకొంది. టైటిల్ అనౌన్స్ చేయక ముందు నుంచి మహేష్ బాబు పరశురాం సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందని అన్నారు. కాని ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో దాదాపు 6 సినిమాలు ఉన్నాయి. దాంతో తన డేట్స్ సర్ధుబాటు కావడం లేదట. దాంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి కియారా అద్వాని పేరు మార్మోగిపోయింది. కాని తనది అదే పరిస్థితి అని ఇప్పుడు అంటున్నారు.

 

ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వాని వాస్తవంగా సర్కారు వారి పాట కి సై అన్నదన్న వార్తలో నిజం ఉందట. కాని కరోనా కారణంగా బాలీవుడ్ లో తను కమిటయిన సినిమాలకి డేట్స్ తారుమారు కావడంతో మళ్ళీ డేట్స్ సర్ధుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందట. అందుకే సర్కారు వారి పాట లో కియారా డౌటే అంటున్నారు. అందుకే ఇప్పుడు కాస్త ఖాళీగా ఉన్న మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరన్నది క్లారిటి రానుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: