తెలుగు సినీప్రముఖులు త్వరలో ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నారు. ఈనెల తొమ్మిదో తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు భేటీకాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆద్వర్యంలో వీరు కలుస్తారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ షూటింగ్ లకు అనుమతులు ఇచ్చే విషయంపై వీరు చర్చలు జరుపుతారు. ఈ భేటీ వివరాలను నిర్మాత కల్యాణ్ మీడియాకు వివరించారు.

 

 

ఇది మంచి పరిణామమే అయినా.. ఈ భేటీకి ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరుకాబోవడం లేదు. అయితే బాలకృష్ణను కూడా ఆహ్వామనించామని సిని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు. కానీ ఈనెల 10 న జన్మదిన వేడుకలు ఉండటం వల్ల వల్ల తాను రాలేనని బాలకృష్ణ చెప్పారని సి. కల్యాణ్ వివరించారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి ఈ సినీ ప్రముఖులు సీఎంతో చర్చిస్తారని కల్యాణ్ చెప్పారు.

 

 

ఇంత వరకూ బాగానే ఉంది. కానీ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ పెద్దలు మరోసారి బాలయ్యను అవమానించారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇటీవల ఇదే సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసినప్పుడు బాలయ్యను ఆహ్వానించలేదు. ఈ విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పెద్దలంతా తెలంగాణ మంత్రితో కూర్చుని భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య వారిపై మండిపడిన సంగతి తెలిసిందే.

 

 

మంత్రి తలసానితో భేటీకి గానీ.. సీఎంతో భేటీకి కానీ తనను ఆహ్వానించపోవడంపై బాలకృష్ణ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా చిరంజీవి టీమ్ బాలయ్యను ఎవాయిడ్ చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నట్టుండి సరిగ్గా బాలయ్య పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు ముహూర్తం నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: