టాప్ సీనియర్ హీరోల వారసులు అంతా హీరోలుగా మారిపోవడంతో ఈ విషయంలో బాలకృష్ణ మాత్రం పూర్తిగా వెనకపదిపోయాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. వాస్తవానికి మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీకి సంబంధించిన వార్తలు 2017 నుంచి వస్తూనే ఉన్నాయి.


ఇలా వార్తలు వచ్చినప్పుడల్లా బాలయ్య వైపు ఎంతో ఆశగా నందమూరి అభిమానులు చూస్తున్నారు. వాస్తవానికి బాలయ్యకు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేయాలని కోరిక ఉన్నా మోక్షజ్ఞకు మాత్రం సినిమాల పై పెద్దగా ఆసక్తి లేదు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు మోక్షజ్ఞ కు సినిమాల కన్నా పారిశ్రామికవేత్త గా ఎదగాలని కోరిక ఉంది అంటూ బాలయ్య సన్నిహితుల నుండి లీకులు వస్తున్నాయి.


అయితే మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ పై బాలయ్య అభిమానుల నుండి రోజురోజుకీ ఒత్తిడి పెరిగిపోతున్న పరిస్థితులలో బాలకృష్ణ వ్యూహాత్మకంగా తనకు ఎంతో సన్నిహితమైన రాఘవేంద్రరావు క్రిష్ బోయపాటి లాంటి కొందరు  దర్శకుల చేత ఇప్పటికే మోక్షజ్ఞ మనసు మార్చి నచ్చచెప్పడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు కూడ గాసిప్పులు వచ్చాయి. వాస్తవానికి మోక్షజ్ఞ కు 26 సంవత్సరాలు రావడంతో టెన్షన్ పడుతున్న బాలయ్య లేటెస్ట్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా పేరు గాంచిన బుర్రా సాయిమాధవ్ కి మోక్షజ్ఞ బాధ్యతలు అప్పచెప్పి ఏదోవిధంగా ఒక మంచి కథ చెప్పి తన కొడుకు ఫిలిం ఎంట్రీకి రంగం సిద్ధం చేయవలసిందిగా కోరినట్లు టాక్.


బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు సంభాషణలు వ్రాసిన నాటి నుండి బాలయ్యకు బుర్రా సాయి మాధవ్ అంటే విపరీతమైన గౌరవం. ఇప్పుడు సాయి మాధవ్ రంగంలోకి దిగి మోక్షజ్ఞ మనసు మార్చడమే కాకుండా అతడి బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథను చెప్పి ఒప్పించ గలిగితే బాలయ్యకు ఈ షష్టిపూర్తి వేడుకలు నిజమైన ఆనందాన్ని కలిగిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: