టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ గత్ర కొన్ని రోజులుగా కెరీర్ పరంగ ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు వరుస హిట్లతో నంబర్ వన్ స్థానంలో ఉండే వినాయక్, వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడనుకున్నా ఆ తర్వాత వచ్చిన ఇంటిలిజెంట్ సినిమాతో నిరాశ పర్చాడు. అదీగాక ఖైదీ నంబర్ 150 సినిమా క్రెడిట్స్ అన్నీ చిరంజీవి ఖాతాలోకి వెళ్లాయి.

IHG


ప్రస్తుతం స్టార్ హీరోలెవరూ వివి వినాయక్ తో సినిమా చేయడానికి హీరోలెవరూ ఆసక్తి చూపడం లేదు. దాంతో నటన వైపు మళ్ళడానికి సిద్ధపడ్డాడు. దిల్ రాజు నిర్మాతగా శీనయ్య అనే సినిమా పట్టాలెక్కింది. వివి వినాయక్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం వినాయక్ బరువు కూడా తగ్గాడు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా యంగ్ గా కనబడ్డాడు.

 

కరోనా ధాటికి సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో పడడంతో వినాయక్ సినిమాని ఆపాలని దిల్ రాజు చూస్తున్నాడట. అయితే ఈ సినిమా ఆగిపోతే వివి వినాయక్ ఏం చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ఈ విషయమై వివి వినాయక్ ఆల్రెడీ తన ప్లాన్లలో ఉన్నాడని సమాచారం. లాక్డౌన్ టైమ్ లో రెండు మూడు స్క్రిప్టులు రెడీ చెసి పెట్టుకున్నాడట. ఇంట్రెస్టింగ్ లైన్స్ తో పాటు స్క్రిప్టులు కూడా రెడీ చేసాడట.

 

ప్రస్తుతం ఆ స్క్రిప్టులో నటించే యంగ్ హీరోని వెతికే పనిలో ఉన్నాడట. హీరో గనక ఒప్పుకుంటే మళ్ళీ డైరెక్షన్ వైపు వచ్చే అవకాశం ఉంది. అన్నీ కుదిరి హీరో దొరికితే ఎంత వీలైతే అంత త్వరగా సినిమాని పట్టాలెక్కించేస్తాడని అంటున్నారు. డైరెక్టర్ గా కొత్త దర్శకులతో పోటీ పడుతున్న వినాయక్ ఔట్ డేటెడ్ అనిపించుకోకముందే మరో మారు హిట్ కొట్టి తన సత్తా చూపిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: