‘ఆర్ఆర్ఆర్’లోకి శ్రియ ఎంట్రీ ఖాయమైంది. ఈ విషయాన్ని శ్రియనే స్వయంగా తెలిపారు. గత కొంతకాలంగా ఈ చిత్రంలో శ్రియ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్దేవగణ్కు శ్రియ జోడిగా నటిస్తుందంట. రాజమౌళి గతంలో తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో శ్రియ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ‘ఛత్రపతి’లో రెబల్స్టార్ ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ శ్రియకు ఆ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఒకరు, బాలీవుడ్ నుంచి మరొకరిని తీసుకున్న రాజమౌళి తాజాగా.. ఈ టాలీవుడ్ హీరోయిన్కు సైతం సినిమాలో అవకాశం కల్పించారంటూ నెటిజన్లు స్పందనను తెలియజేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ పోషిస్తున్న పాత్ర ఫ్లాష్ బ్యాక్లో వస్తుందంట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్లో అజయ్ దేవగణ్తో కలిసి శ్రియా శరన్ నటిస్తుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల విడుదల చేయాలనే లక్ష్యంతో రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ కథానాయకులుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చినట్లు చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. మిగిలిన షెడ్యూల్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది చిత్ర యూనిట్.
లాక్డౌన్ నుంచి చిత్ర సీమకు సడలింపులు దక్కగానే షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన లుక్ అవుట్లు, టీజర్లతో యూట్యూబ్ షేక్ అవుతున్న విషయం తెలిసిందే. రామ్చరణ్, తారక్ల కెరీర్లలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలుస్తుందని చిత్ర వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. దక్షణాది భాషాలతో పాటు బాలీవుడ్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్కు హీరోయిన్గా ఒలీవియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అందుకే బాలీవుడ్కు చెందిన కొంతమంది నటులను ఇందులో మిలితం చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..!