న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న విరాట‌ప‌ర్వం సినిమాకు హీరోయిన్ సాయిప‌ల్లవి పెద్ద అండ‌గా మారింద‌ని చిత్ర ద‌ర్శ‌కుడువేణు ఊడుగుల కొనియాడారు. సాయిప‌ల్ల‌వి స‌హ‌జ‌న‌ట‌న ఈ సినిమాకు ఎంతో ప్ల‌స్ అవుతుంద‌ని చెప్పారు. తన సినిమాలో హీరోయిన్‌ పాత్రను రాసుకున్నప్పుడే సాయి పల్లవిని తీసుకోవాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రించిన స‌న్నివేశాల్లో సాయిప‌ల్ల‌వి అద్భుతంగా న‌టించింద‌ని కొనియాడారు. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణుగు ఊడుగుల విమ‌ర్శ‌కుల‌చే ప్ర‌శంస‌లు అందుకున్నారు. విరాట ప‌ర్వం క‌థ న‌చ్చ‌డంతో  రానా క‌థానాయకుడిగా న‌టిస్తున్నారు. 

 

 ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌కుడు వేణు చిత్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై త‌న అనుభ‌వాల‌ను, అభిప్రాయాల‌ను మీడియాకు తెలిపారు.  సాయి పల్లవి గురించి మాట్లాడుతూ త‌న‌కు  ”ప్రేమమ్‌లో సాయి పల్లవి నటన ఎంత‌గానో న‌చ్చింద‌ని తెలిపారు. సాయి పల్లవి మొదటి సినిమా సమయంలోనే నేను ఆమెను సంప్రదించాను. కానీ బిజీగా ఉండటం వలన క‌లిసి ప‌నిచేయ‌డం  అప్పుడు కుదరలేదు. ‘విరాట పర్వం’లో హీరోయిన్‌ పాత్రకు సాయి పల్లవినే న్యాయం చేయగలదని బ‌లంగా న‌మ్మాను..ఆ న‌మ్మ‌కాన్ని ఆమె నిల‌బెట్టారంటూ చెప్పుకొచ్చాడు. వాస్త‌వానికి  'విరాట్‌ పర్వం' చిత్రంలో సాయి పల్లవి నటించడం లేదని వార్తలు వినిపించాయి.

 

 ఈ ప్రాజెక్టు నుంచి పల్లవి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. అనారోగ్యం రీత్యా ఇందులో హీరోగా చేయనున్న రానా దగ్గుబాటి అమెరికాలో వైద్యం నిమిత్తం వెళ్లనున్నారని, అందువల్ల ఈ చిత్రం ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని, అందువల్ల ఇందులో సాయిపల్లవి నటించదని మొద‌ట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అవేమీ నిజం కాలేదు. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి పాత్ర‌పై ఆమె అభిమానుల్లో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఇందులో విప్ల‌వ యోదురాలిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.తన పాట‌ల‌తో సమాజాన్ని మార్చే వ్యక్తిగా కనిపించబోతోంద‌ని స‌మాచారం. 1990లో గ్రామీణ తెలంగాణలో ఉండే నక్సలిజం నేపథ్యాన్ని ప్రేమకథను అనుసంధానం చేస్తూ ఈ సినిమా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి వరంగల్‌కు చెందిన అమ్మాయిగా కనిపించబోతోంది. ఇందులో రానా సరసన సాయి పల్లవి నటిస్తుండగా.. ప్రియమణి, నందితా దాస్‌, జరీనా వాహిబ్‌, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: