మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సుబ్బు డైరెక్ట్ చేస్తుండగా భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్, మొదటి సాంగ్ తో ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దేవా కట్టా డైరెక్షన్ లో సాయి తేజ్ సినిమా మొదలైనన్న విషయం తెలిసిందే. సినిమాలో సాయి తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

 

ఇక ఈ సినిమా తర్వా సాయి తేజ్ మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. బిందాస్, రగడ సినిమాలను  వీరు  పోట్ల డైరక్షన్ లో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుందని టాక్. ఇప్పటికే సాయి తేజ్ కు కథ చెప్పడం అతను ఓకే  చేయడం అంతా జరిగిందట. ఈ సినిమాలో కామెడీ  అదిరిపోతోంది తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన సాయి తేజ్ కెరియర్ లో మొదటిసారి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సాయి తేజ్ శ్రీకృష్ణ దేవరాయలు లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లు రెగ్యులర్ సినిమాలు చేసిన సాయి తేజ్ కూడా విలక్షణ సినిమాలు చేయబోతున్నాడని తెలుస్తుంది. 

 

వరుసగా ఆరు ప్లాపులు అందుకున్న సాయి తేజ్ లాస్ట్ ఇయర్ చిత్రలహరితో సక్సెస్ అందుకోగా ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సాంగ్ కూడా ఇంప్రెస్ చేయగా రాబోయే సినిమాలతో తప్పకుండా సాయి తేజ్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తాడని తెలుస్తుంది.                                      

మరింత సమాచారం తెలుసుకోండి: