స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథమ్. 2017లో విడుదలైన ఈసినిమా నెగిటివ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి కమర్షియల్ గా హిట్ అనిపించుకుంది.  ఈచిత్రాన్ని గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్  హిందీలోకి  డబ్ చేసి యూట్యూబ్ లోకి విడుదలచేయగా రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబట్టింది అయితే  ఆతరువాత కొన్ని కారణాల వల్ల  యూ ట్యూబ్ నుండి ఈసినిమాను తొలిగించారు ఇక ఇటీవల మళ్ళీ రీ అప్లోడ్ చేయగా ఇప్పటివరకు ఈ చిత్రం 250మిలియన్ల వ్యూస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ సాధించడం అల్లు అర్జున్ కు ఇది రెండో సారి. సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ ఏకంగా 288 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. 
 
ఇక బన్ని ప్రస్తుతం పుష్ప లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో  టాప్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బన్ని లారీ డ్రైవర్ గా కనిపించనుండగా అతనికి  జోడిగా  రష్మిక మందన్న నటించనుంది. రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా  నిర్మించనున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ సింహ ,కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టి  విలన్ పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం  పాన్ ఇండియా సినిమా గా విడుదలకానుంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడం  విశేషం.  ఆగస్టు నుండి  సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను విడుదలచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: