టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నాటి హీరో లకు సంబంధించిన వారసులు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తమ హవా నడిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి. ఇక అప్పట్లో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎన్టీఆర్ నట వారసుడిగా... ఆయన పేరుతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఇది మొదటి కావడమే కాదు... ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తిరుగులేని దర్శకుడుగా కొనసాగుతున్న రాజమౌళికి కూడా ఇది మొదటి సినిమానే. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించారు. 

 


 ఇక ఆ తర్వాత సింహాద్రి సినిమాలో కూడా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయింది. సింహాద్రి సినిమా ద్వారా నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక సరికొత్త ఫాలోయింగ్ సంపాదించారు. కెరీర్ మొదట్లోనే ఎవ్వరూ ఊహించని విధంగా మాస్ ఫాలోయింగ్ సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్. సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసే యాక్షన్ సన్నివేశాలు అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ సినిమాలో రాజమౌళి టేకింగ్... ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది. సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ సరసన  నటించిన భూమిక తన అందం అభినయంతో కూడా ఆకట్టుకుంది. 

 


 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో  కెరియర్ మొదట్లోనే ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకుల్లో  ఎంతగానో క్రేజ్ సంపాదించి ఉర్రూతలూగించారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చిన ఆది సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో సంచలన  విజయంగా నిలిచిపోయింది. ఈ రెండు సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని కీలక మలుపు తిప్పి స్టార్ హీరో  రేంజికి ఎదిగేలా  చేశాయనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో  జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించి మాస్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక సంపాదించారు. అయితే ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: