దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో మెగాభిమానులలో ఫుల్ జోష్ నెలకొంది. రాజకీయాల్లో రాణిస్తారు అని అందరూ భావించిన, పోటీకి నిలబడిన రెండు చోట్ల ఓడిపోవడంతో పాటు జనసేన పార్టీకి ఒకే ఒక స్థానం రావడంతో మొన్నటివరకు ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు రాజకీయాలకే పరిమితం అని అభిమానులు కూడా డిసైడ్ అయిన సమయంలో అనూహ్యంగా అభిమానులకు షాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇవ్వటం జరిగింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ‘వకీల్ సాబ్’ టైటిల్ పేరిట రీ ఎంట్రీ ఇవ్వడం మనకందరికీ తెలిసిందే.

IHG

బాలీవుడ్ 'పింక్' సినిమాకి గాను రీమేక్ గా వస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ సినిమా మే 15 వ తారీఖున రిలీజ్ అయ్యుండేది. లాక్ డౌన్ దెబ్బకు సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవటంతో ఇంకా నెల రోజులు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నది. ఇటువంటి టైములో రీ ఎంట్రీ సినిమా మొదటిది అవుట్ ఫుట్ సరిగ్గా రావడం కోసం పవన్ కళ్యాణ్ సరికొత్త ప్లాన్ వేశారు.

IHG

అదేమిటంటే ఈ సినిమా తో పాటు స్టార్టింగ్ లో క్రిష్ సినిమా కూడా చేయడం జరిగింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా రెండు సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. అయితే లాక్ డౌన్ అనంతరం పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని పవన్ డిసైడ్ అయ్యారట. సినిమా క్వాలిటీ దెబ్బ తినకుండా ఉండేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: