తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు  హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అభిమానులను అలరిస్తున్నారు. అయితే నందమూరి అభిమానులు అందరూ నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నందమూరి హీరోలందరికీ మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వుంటుంది. ఇక నందమూరి హీరోలు చేసే సినిమాలు కూడా ఎక్కువగా మాస్ ప్రేక్షకులను అలరించే  విదంగా  ఉంటాయి. 

 


 ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ... జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయంటే చాలు మాస్ ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు. అయితే మొన్నటికి మొన్న సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్  బాలకృష్ణలు ఓకే  స్క్రీన్ పై  కనిపించి  ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక మంచి కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు అభ్యంతరాలు లేవు అని గతంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా చెప్పుకొచ్చారు. తాము చేసే కథ ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్నదే తమ  ఉద్దేశమని తాజాగా  నందమూరి బాలకృష్ణ అన్నారు. 

 

 అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా లో మోహన్ లాల్ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను  సంప్రదించారట. కానీ ఎందుకో  బాలకృష్ణ మాత్రం ఆ  పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. ఇక దర్శకులు కూడా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలో తెరకెక్కిస్తే మంచి హిట్ కూడా సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ కి చెందిన ముగ్గురు హీరోలు మెచ్చే కథ ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వస్తే ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి పాత్రలో నటిస్తారు ప్రేక్షకులకు  ఎలా ఎంటర్టైన్మెంట్ పంచుతారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: