టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. బాబు సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అతని క్రేజ్ ఆ రేంజ్ లో ఉంటుంది. అతని సినిమాలు అతని నటన కోసం ఫాన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇది పక్కన పెడితే బాబుకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అతని సినిమా విడుదల అయినా అతని పుట్టిన రోజు వస్తున్న సరే సోషల్ మీడియా షేక్. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను సోషల్ మీడియా మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు అని అంటున్నారు. అవును సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన మార్కెట్ ని పెంచుకోవడానికి గానూ ఇక అతను పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తారక్ ఒక సినిమా గురించి మాట్లాడే సమయంలో సోషల్ మీడియా గురించి మాట్లాడినట్టు సమాచారం. తాను సోషల్ మీడియాలో ఇక నుంచి యాక్టివ్ గా ఉంటా అని చెప్పాడు అని అంటున్నారు. 

 

తన సినిమా ప్రమోషన్ బాధ్యతల్లో తాను ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే తీసుకుంటా అని స్పష్టంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది మరి. అతను ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టినా సరే అది ఆలస్యం కచ్చితంగా అవుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: