చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో ఇప్పటికే దాదాపు షూటింగ్ ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ని సగానికి పైగా పూర్తి చేసుకోవడంతో ఈ ఏడాది సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది అనే ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవిసినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ఈ సినిమా గురించి బయటకు వచ్చింది. 

 

అది ఏంటీ అనేది చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించడం లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె బిజీ గా ఉంది అని అంటున్నారు. ఆమె టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని ఆమె తమిళంలో ఒక భారీ ప్రాజెక్ట్ ని చేస్తుంది అని ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆమె ప్రస్తుతం ఈ సినిమా మీద దృష్టి పెట్టలేక వద్దు అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె రాబోయే రెండేళ్ళు కూడా బిజీ గా ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కొత్త హీరోయిన్ ని వెతికే ఆలోచనలి ఉన్నారు అని అంటున్నారు. 

 

కొత్త హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క ని ఎంపిక చేసే అవకాశం ఉందని లేదా త్రిష ని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎవరిని ఈ సినిమాలో ఎంపిక చేస్తారు అనేది చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: