మన తెలుగులో ఇప్పుడు కొత్త హీరోయిన్ ల కోసం వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు. ఎవరు తక్కువకి సినిమా చేస్తే వారినే సినిమాల్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు చాలా వరకు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా స్టార్  హీరోయిన్ లతోనే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే వారు కూడా ధరలను భారీగా పెంచడం తో నిర్మాతలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

అతను టిక్ టాక్ లో ఒక అమ్మాయిని చూసాడు అని ఆమెకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని సుకుమార్ తో కూడా చర్చించాడు అని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ కూడా దీనికి ఓకే చెప్పాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమెను అడిగితే ఎంతకు సినిమా చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగానే జరుగుతున్నాయి అని అంటున్నారు. ఆమె విషయంలో గతంలో ఒక స్టార్ హీరో కూడా ఆసక్తి చూపించారు అని కాని అప్పుడు అతను బిజీ గా ఉండటంతో ఆమె విషయంలో అంత ఆసక్తి చూపించలేదు అని అంటున్నారు. 

 

ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో బన్నీ ఎక్కువగా దృష్టి పెట్టాడు అని చిత్ర యూనిట్ తో కూడా అన్నీ ఇప్పటికే మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమెను పుష్ప సినిమాలో తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ గా రష్మిక మందన ను అనుకున్నారు అని సమాచారం. మరి ఆమె ఎం చెప్పింది అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: