టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా హోదా తెచ్చుకుంది ప్రియమణి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలు ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆమె దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి తెలుగులో సినిమాలు చేసింది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆమె మాత్రం సినిమాలను ఏ విధంగా అకుడా ఆపే ప్రయత్నం చేయలేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. వెంకటేష్ హీరో గా వచ్చే నారప్ప సినిమాలో ఆమె అతనికి భార్యగా నటిస్తుంది. 

 

ఇక విరాట పర్వం సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఏ సినిమా చెయ్యాలి అనే దాని మీద ఆమె ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఆమె ఒక స్టార్ హీరో తో సినిమా తో పాటుగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని జనాలు అంటున్నారు. ఆమె ప్రస్తుతం రెండు సినిమాలు కాగానే ఒక సీరియస్ సినిమాలో సోలో పాత్ర చెయ్యాలి అని భావిస్తుంది. 

 

ఒక రేప్ కి గురైన వివాహిత పాత్రలో ఆమె సినిమా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు మరి. దీనికి సంబంధించిన కథ కూడా దాదాపుగా సిద్దంగా ఉంది అని అంటున్నారు. ఆమె ఈ సినిమాలో నటించడానికి గాని ఒక్క మాటలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉండటం తోనే ఆమె ఈ సినిమా చేస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: