యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'రౌద్రం రణం రుథిరం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న  త్రివిక్రమ్‌ కి ఈసినిమా గొప్ప పేరుని తెచ్చి పెట్టింది. బన్నీకి ఇండస్ట్రీ రికార్డ్ ఇచ్చాడని ఫ్యాన్స్ తెగ చెప్పుకున్నారు. 

 

ఇక త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ తో చేయబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకు 'అయినను పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్‌ను అనుకుంటున్నప్పటికి అఫీషియల్ గా మాత్రం వేరే టైటిల్ ని రిజిస్టర్ చేయించారని సమాచారం. ఇక పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తుంది. 

 

ఇక అల వైకుంఠపురము లో సినిమాకి ముందు ఎన్టీఆర్ పూజా హెగ్డే కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని చూపించిన విధానం సినిమాకే హైలెట్ గా నిలిచింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే మరోసారి ఇలాంటి పవర్ ఫుల్ సినిమా అనే అందరూ అనుకుంటున్నారు. 

 

కాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ చాలా జోవియల్ గా చూపించబోతున్నారట. అంతేకాదు అరవింద సమేత లో చూపించినట్టు పవర్ ఫుల్ గాను చూపించే విధంగా స్క్రిప్ట్ రాస్తున్నాడని తెలుస్తుంది. అంటే ప్రేక్షకులు తారక్ ని రెండు విభిన్న పాత్రల్లో చూడబోతున్నారని చెప్పొచ్చు. మరి ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ రేంజ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఆ రేంజ్ కి ఈ సినిమా తీర్చి దిద్దాల్సి ఉంటుంది మన మాటల మాంత్రీకుడు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: