అక్కినేని నాగ చైతన్య సమంత కలిసి నటించిన మజిలీ మంచి సక్సస్ ని సాధించింది. ఈ సినిమా తర్వాత అదే సక్సస్ ని కంటిన్యూ చేయడానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఫిదా బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ జోనర్ లో ఈ సినిమాని అద్భుతంగా తెరకిక్కించాడట శేఖర్ కమ్ముల. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతంగా అంచనాలు పెరిగాయి. నాగ చైతన్య కి బాగా కలిసి వచ్చే లవర్ బాయ్ క్యారెక్టర్ కావడం సాయి పల్లవి హీరోయిన్ ..ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ టీజర్ సాంగ్ ..ఇలా అన్ని కలిపి బ్లాక్ బస్టర్ అన్న టాక్ వచ్చింది. 

 

ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్టు చెప్పుకుంటున్నారు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ చైతూ అకౌంట్ లో మరో సక్సస్ పడబోతుందని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య నటించే కొత్త సినిమా న్యూస్ వచ్చింది. అది కాస్త అక్కినేని ఫ్యాన్స్ ని కంగారు పెడుతుంది. ఆ కంగారుకి కారణం దర్శకుడు విక్రం కె కుమార్. మంచి సక్సస్ ట్రాక్ మేయిన్‌టైన్ చేస్తున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమా విక్రం కుమార్ దర్శకత్వంలో ఉండబోతుందని తాజా సమాచారం.

 

సినిమా మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇక్కడే ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందట. ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ విక్రం కుమార్ కి సక్సస్ దక్కలేదు. సూర్య తో తీసిన 24, అక్కినేని అఖిల్ తో తీసిన మిస్టర్ మజ్ఞు, నాని తో తీసిన గ్యాంగ్ లీడర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. చెప్పాలంటే ఇవన్ని మంచి ప్రయోగాలని చెప్పాలి. కాని ఈ ప్రయోగాలతో హీరోలకి హిట్ ఇవ్వలేకపోయాడు. 

 

అయితే మనం వంటి సూపర్ హిట్ ని దృష్ఠిలో పెట్టుకొని చైతు విక్రం కుమార్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఈ దర్శకుడు చెప్పిన కథ కూడా చైతూని బాగా ఇంప్రెస్ చేసిందట. అందుకే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని అంటున్నారు. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేక సక్సస్ ట్రాక్ ని పాడు చేసుకుంటాడో చూడాలి. కాని ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి సమయంలో చైతు విక్రం కుమార్ కి ఓకే చెప్పి రాంగ్ స్టెప్ వేస్తున్నాడేమో అని అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: