గతంలో ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ పరిస్థితి ప్రస్తుతం అయోమయం. ‘కల్కి’   పరాజయం తరువాత ఒక నాటి యాంగ్రీ మెన్ గా వెలుగు వెలిగిన ఈ హీరో ‘భాయ్’ దర్శకుడు వీరభద్రం చౌదరితో సినిమాచేస్తాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి వార్తలు రాలేదు.

 

ఆపై కన్నడ హిట్ మూవీ ‘కవులుదారి’ రీమేక్‌లో రాజశేఖర్ నటిస్తాడు అని ప్రకటన కూడ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమాని సుమంత్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని ఒక షాకింగ్ న్యూస్ బయటకు రావడంతో ఆ న్యూస్ విని చిరంజీవి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.

 

తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’ భాగస్వామ్యంలో రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ను హీరోగా పెట్టి ఒక మూవీని తీయడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ‘పలాస 1978’ సినిమాతో సత్తా చాటుకున్న కొత్త దర్శకుడు కరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని టాక్.

 

గతంలో అల్లు అరవింద్ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ తాను కరుణ్ తో ఒక సినిమాను తీస్తాను అని ఓపెన్ గానే చెప్పాడు. ఇప్పుడు అరవింద్ తాను ఇచ్చిన మాట ప్రకారం జీవితతో చేయి కలిపి రాజశేఖర్ సినిమాలో తన పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాజశేఖర్ కు చిరంజీవితో అనేక విభేదాలు ఉన్నాయి. ఆమధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించిన వివాదంలో రాజశేఖర్ తీరు పట్ల చిరంజీవి తీవ్ర అసహనాన్ని వ్యక్త పరచడమే కాకుండా మా సంస్థ నుండి రాజశేఖర్ రాజీనామా చేసే విధంగా పరోక్షంగా ప్రవర్తించాడు. ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ తో అరవింద్ సినిమా తీయడం ఏమిటి అనీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా చిరంజీవి అభిమానులు కూడ షాక్ అవుతున్నారు. అందుకే రాజకీలాలలో సినిమాలలో శాశ్విత శతృవులు మిత్రులు ఉండరు అని అని అంటారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: