శ్రీను వైట్ల డైరక్షన్ లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ఢీ. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ  సినిమాలో బ్రహ్మానందం, శ్రీహరి  ప్రధాన  పాత్రల్లో నటించారు. మంచు విష్ణుకి  మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన  ఆ సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబోలో ఢీ సీక్వల్ రాబోతుందని తెలుస్తుంది. ఈ సీక్వల్ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. 

 

ఢీ సినిమాకు కోనా వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. శ్రీను వైట్ల, కోనా వెంకట్ తో సెపరేట్ అయ్యాక అతని కెరియర్ లో హిట్లు లేకుండాపోయాయి. సినిమాలైతే  హిట్లు అందుకోవడంలో వెనుకపడ్డాడు.  అందుకే సూపర్ హిట్ సినిమా సీక్వల్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు శ్రీను వైట్ల. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఢీ అండ్ ఢీ టైటిల్ తో ఈ సీక్వల్ వస్తుందట. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనేది ఉపశీర్షిక. 

 

ఢీ సినిమా ఆద్యంతం వినోదంతో సూపర్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ముఖ్యంగా మంచు విష్ణు, బ్రహ్మానందంల మధ్య కామెడీ కేక పెట్టించింది. శ్రీహరిని హీరో బురుడి కొట్టించే విధానం కూడా బాగుటుంది. ఇప్పుడు అలాంటి కథతోనే ఈ సినిమా సీక్వల్ వస్తుందని అంటున్నారు. కెరియర్ లో డైరక్టర్ గా శ్రీను వైట్ల, హీరోగా మంచు విష్ణు ఇద్దరు చాలా వెనుకపడ్డారు. మరి ఈ సూపర్ హిట్ సీక్వల్ తో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని.. ఈసారి అనుకున్న టార్గెట్ రీచ్ అవడం గ్యారెంటీ అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.        

మరింత సమాచారం తెలుసుకోండి: