రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా అభిమానులు ఒక పండగలా ఫీల్ అవుతుంటారు. ఆర్.ఆర్.ఆర్ లాంచింగ్ నుండి మొదలుకుని, మోషన్ పోస్టర్, రామ్ చరణ్ లుక్ వరకూ అన్నింటినీ పక్కాగా ప్లాన్ చేసి మరీ వదిలాడు. ప్రజల్లోకి సినిమాని ఎలా తీసుకెళ్లాలనే విషయమై రాజమౌళికి తెలిసినంతగా మరొకరికి తెలియదనే చెప్పాలి. ఆయన ప్రతీ సినిమా విషయంలోనూ తనదైన స్ట్రాటజీ ఫాలో అవుతుంటాడు.

 

 

ఏ విషయాలు బయటకి వెల్లడించాలి, ఏ విషయాలని రహస్యంగా ఉంచాలి అనేది రాజమౌళికి బాగా తెలుసు. బాహుబలి సమయంలో కథ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. సోషియో ఫాంటసీ అని తప్ప మరో విషయం బయటకి వెల్లడి కాలేదు. అదే ఆర్.ఆర్.ఆర్ విషయానికి వచ్చేసరికి రాజమౌళి రూటు మార్చాడు. నిజ జీవితంలోని రెండు పాత్రలని తీసుకుని కల్పిత కథతో మన ముందుకు వస్తున్నాడు.

 

 

అసలు సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసినట్లు చరిత్రలో లేదు. కానీ రాజమౌళి వారిని కలపబోతున్నాడు. ఎలా కలపబోతున్నాడనేదే ఆసక్తిగా మారింది. ఈ ఒక్క విషయం వల్లే ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి. అయితే ప్రతీ అప్డేట్ ని ఎంతో పకడ్బందీగా రివీల్ చేద్దామనుకున్న రాజమౌళికి హీరోయిన్  శ్రియ పెద్ద షాక్ ఇచ్చింది.

 

 

ఆర్.ఆర్.ఆర్ లో తాను కూడా నటిస్తున్నానని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ దేవగణ్ సరసన కనిపిస్తానని చెప్పడంతో రాజమౌళి బృందం షాక్ కి గురైంది. ఒక్కసారిగా అలర్ట్ అయిన చిత్రబృందం శ్రియకి గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఇంకోసారి ఇలాంటి లేకేజీలు చేస్తే బాగోదని హెచ్చరించారట.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: