ఎటువంటి హంగామా లేకుండా తన షష్టిపూర్తి వేడుకలను జరుపుకోబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ పుట్టినరోజున వేడుకల హంగామా మామూలుగా ఉండేది లేదు అని అంటున్నారు. ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ షష్టిపూర్తి సందర్భంగా నాలుగు రకాల ఊహించని వింతలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.  


గాయకుడు సింహా పాడిన పాట ‘జై బాలయ్య జై జై బాలయ్యా’ ఈ వేడుకలకు హైలెట్ గా నిలవబోతోందని సమాచారం. నందమూరి వంశోద్దారకుడా హిందూపురమున విజయసింహుడా అంటూ కొనసాగే ఈ పాటలో బాలయ్యను ఆకాశంలోకి ఎత్తేసే అనేక రకాల పద ప్రయోగాలు ఉంటాయని అంటున్నారు.  


ఇది చాలదు అన్నట్లుగా బాలయ్య స్వయంగా కరోనా పై పాడిన పాట ఈ షష్టిపూర్తి సంబరాలకు హైలెట్ అనీ బాలయ్య తో పాటు ఈ పాటను మరోక లేడీ సింగర్ కూడా పాడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బోయపాటి బాలకృష్ణల సినిమాకు సంబంధించిన ఒక చిన్న టీజర్ ను కూడ విడుదల చేయబోతున్నట్లు లీకులు వస్తున్నాయి.  


ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడో బాలయ్య నటించడమే కాకుండా దర్శకత్వం చేసి మొదలు పెట్టిన ‘నర్తనశాల’ పౌరాణిక సినిమాలోని కొన్ని సీన్స్ ను ఒక వీడియోగా రూపొందించి ఇప్పుడు విడుదల చేస్తారట. సౌందర్య మరణంతో బాలయ్య ఎన్నో ఆశలు పెట్టుకుని మొదలు పెట్టిన ఆ మూవీ అప్పట్లో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాలోని కొన్ని సీన్స్ కు తన షష్టిపూర్తి రోజున బాలయ్య మోక్షం కలిగించ బోతున్నాడు. అదేవిధంగా బాలయ్య సోషల్ మీడియా ఎంట్రీ కూడ షష్టిపూర్తి రోజునే ఉంటుంది అని అంటున్నారు. ఇలా ఈ విషయాలకు సంబంధించిన అన్ని వీడియోలు రోజుకు రెండు చొప్పున ఈరోజు రేపు విడుదల చేస్తూ తన షష్టిపూర్తి వేడుకలలో ఈ నందమూరి సింహం తన స్పెషలిటీని మరొకసారి చూపెట్టబోతున్నాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: