వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ సినిమాతో నితిన్ కెరీర్లో మంచి హిట్ వచ్చి చేరింది. చాలా రోజుల తర్వాత నితిన్ కి సాలిడ్ హిట్ లభించింది. అయితే ఈ చిత్రం తర్వాత నితిన్, హిందీ చిత్రమైన అంధాధున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంధాధున్ రీమేక్ హక్కుల్ని కొనుక్కున్న నితిన్ చేయావా వద్దా అన్న ఊగిసలాటలో కొద్ది కాలం గడిపిన తర్వాత చేయాలనే ఫిక్స్ అయ్యాడు.

 

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన అంధాధున్ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ప్రేక్షకులని కట్టి పడేసింది. ఈ సినిమాలో నటనకి ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాలోని మరొక ప్రధాన పాత్రలో టబు నటించింది. అయితే ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో టబు రోల్ ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది.

 


ఈ సినిమాలో టబు పాత్ర ద్వారానే కథ టర్న్ తీసుకుంటుంది. పాత్ర పరంగా కొంచెం బోల్డ్ గా కనిపించినా కథా పరంగా చాలా కీలకమైనది. అయితే ఈ పాత్రలో నటించడానికి ముందుగా టబునే అడిగారట. కానీ ఈ రీమేక్ లో నటించడానిఇ ఆమె ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఆ పాత్రలో యాంకర్ అనసూయని కూడా అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత సీనియర్ హీరోయిన్ రమ్యక్రిష్ణ అయితే బాగుంటుందని భావించారు.

 

కానీ ఏమైందో ఏమో మళ్ళీ సడెన్ గా బాలీవుడ్ వైపు మళ్ళారు. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ శిల్పాశెట్టిని ఈ పాత్ర చేయమని అడిగారట. దానికి శిల్పాశెట్టి పాజిటివ్ గా స్పందించిందని సమాచారం. ఒకవేళ శిల్పాశెట్టి గనక ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటే సినిమాకి మంచి మైలేజి వచ్చినట్టే. మేర్లపాక గాంధీ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: