టాలీవుడ్ లో కొద్ది రోజులుగా యువరత్న నందమూరి బాలకృష్ణ వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అయితే నడుస్తోంది. చిరంజీవి కొందరు సినిమా ప్రముఖులతో ఎప్పుడు అయితే మీటింగ్ పెట్టి ఆ తర్వాత సీఎం కేసీఆర్ను కలిశారో అప్పటి నుంచి ఇండస్ట్రీ రెండుగా మాట్లాడుతోంది. ఆ వెంటనే బాలయ్య ఈ మీటింగ్కు తనను ఎవ్వరూ పిలవలేదని.. వాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. భూములు పంచుకునేందుకే సమావేశమయ్యారని అనడంతో నాగబాబు ఘాటుగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక బాలయ్య 60వ పుట్టిన రోజు సందర్బంగా ఆయన వరుసగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో చిరంజీవికి డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చేసినట్టు మాట్లాడారు. గతంలో మా డైరీ ఆవిష్కరణ సమయంలో రాజశేఖర్ మాట్లాడుతూ ఆవేశంతో ఊగిపోయి కొందరిపై విమర్శలు చేశారు. ఆ వెంటనే చిరు ఫైర్ అయ్యి రాజశేఖర్పై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పాటు మంచి మైక్లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి అని తాను అన్నా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు బాలయ్యతో యాంకర్ ఇదే విషయం ప్రస్తావిస్తే తాను ఎమోషనల్గా ఏం మాట్లాడినా ఓపెన్గానే ఉంటానని.. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తానని.. అంతేకాని లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడను. నాకు మర్యాద ఇచ్చి మర్యాదు పుచ్చుకోండి.. సింగిల్ ట్యాగ్ అంతే. ఇందులో తేడా వస్తే మాత్రం బాగోదని కుండబద్దలు కొట్టేశారు. ఏంటి చెడు చెవులో చెప్పాలా ? ఎదుటి వాడు చెడు చేశాడంటే మనం చెప్పడం వల్ల వాడు మారితే ఆ తృప్తి అయినా ఉంటుంది కదా..? అని అంటూనే తాను ఒకరిని ఉద్దేశించి అనలేదని నేరుగా చిరును ఏకేస్తూ మాట్లాడారు. అలాగే ఇండస్ట్రీ ఏ ఒక్కడి సొత్తు కాదని కూడా బాలయ్య చెప్పారు.