క్లాస్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయినట్లు ఫిలిం నగర్ టాక్. లాక్ డౌన్ లేకపోయి ఉండి ఉంటే సినిమా ఈ పాటికి రిలీజ్ అయి ఉండేది అని మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో అన్ని సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోవడంతో దాదాపు నాలుగు నెలల వరకు ఓపెన్ చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

IHG

ప్రజలలో భయాందోళనలు పోయిన తర్వాత కరోనా వైరస్ పెద్ద ప్రమాదకరం కాదని అవగాహన కి ప్రజలు వచ్చాక అప్పుడు నెమ్మదిగా సినిమా థియేటర్ లు ఓపెన్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు డిసైడ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 'లవ్ స్టోరీ' సినిమా రాబోయే దసరాకి రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు సమాచారం.

IHG's romance moves to ...

'ఫిదా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా నాగచైతన్య మరియు సాయి పల్లవి మొట్టమొదటిసారి నటిస్తున్న ఈ సినిమా లో రొమాంటిక్ డ్రామా అదిరిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ చాలా మాస్ గా ఉంటుందని సాయి పల్లవి క్యారెక్టర్ చాలా క్లాస్ గా ఉంటుందని, కానీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎపిసోడ్ అద్భుతంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించినట్లు ఇండస్ట్రీ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: