బాలీవుడ్ తార అమీషా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `బద్రి` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమీషా పటేల్. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్తో నరసింహుడు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అమీషా బాలీవుడ్కు వెళ్లిపోయారు. అక్కడ కూడా చాలా సినిమాల్లో నటించారు.
ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్తో నటించిన ‘భూల్ భులాయియా’ చిత్రంతో అగ్ర కథానాయకుల జాబితాలో చోటుదక్కించుకుంది. ఆ రోజుల్లో బాలీవుడ్లో శృంగారతారంటే అందరికీ గుర్తొచ్చే నటి అమీషా పటేల్ మాత్రమే. అయితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో నటించిన సినిమా ‘పరమవీర చక్ర’.
ఇందులో ఆమె బాలకృష్ణకు జోడీగా నటించారు. ఆ తర్వాత వరుస పరాజయాలతో జైత్రయాత్రను కొనసాగించలేకపోయింది. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో హల్ చేస్తుంది ఈ బ్యూటీ. అయితే నాలుగు పదుల వయసులోనూ అమీషా తన అందచందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఈ అమ్మడు నేడు 45వ పుట్టినరోజు జరపుకుంటోంది. ప్రస్తుతం అమీషా పటేల్ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.